మేము సైతం రిలే నిరాహారదీక్షకు పోలిశెట్టి మద్దతు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయ్ అని అధికారికంగా ప్రకటించిన సందర్భంగా శుక్రవారం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ “బాబుతో నేను” ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహారదీక్షలో భాగంగా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార నిరసన దీక్ష కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ను టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆహ్వానించడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి పూలమాలవేసి అనంతరం రెడ్డి సుబ్రహ్మణ్యం మరియు పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి జనసేన పార్టీ టిడిపి పార్టీ కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుండి విముక్తి కలిగించడమే మా లక్ష్యం అని తెలియజేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు పోలిశెట్టి చంద్రశేఖర్ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని వారికి మద్దతు తెలియజేయడం జరిగింది.