‘వకీల్ సాబ్’ సినిమాను నిజాయితీగా రీమేక్ చేస్తున్నాం: వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నసినిమా ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే నెలలో సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో చాలా మార్పులు చేశారని.. వార్తలు వస్తున్ననేపథ్యంలో దర్శకుడు వేణు శ్రీరామ్ పలు విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడి చేశాడు. వకీల్ సాబ్ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ ‘పింక్’ రీమేక్ మూల కథను దారి తప్పించే ప్రమాదం ఉందా అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు స్పందిస్తూ… మేము సినిమాను నిజాయితీగా రీమేక్ చేస్తున్నాం. చాలా తక్కువ సీన్స్ మాత్రమే మార్చడం జరిగింది. ఎక్కువ శాతం సీన్స్ ను ఉన్నది ఉన్నట్లుగానే చేస్తున్నామన్నాడు. మూల కథలో ఎలాంటి మార్పు లేకుండానే వకీల్ సాబ్ ను తెరకెక్కిస్తున్నామన్నాడు. డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్దం చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నాడు.

వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ అక్టోబర్ లేదా నవంబర్ లో వచ్చే అవకాశం ఉందట. సినిమాలో అయిదు పాటలు ఉంటాయని ఒకటి రెండు కొత్త పాత్రలు కనిపించడంతో పాటు కొన్ని కమర్షియల్ సీన్స్ ఉంటాయి. అంతకు మించి పింక్ కు తేడా ఏమీ ఉండదన్నట్లుగా పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నాడు.