బ్యాంకుపేట ప్రాంతంలో యుద్ధానికి మేము సిద్ధమే కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో బ్యాంకుపేట ప్రాంతంలో సిటీ కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్ మరియు సాయి యాదవ్ ఆధ్వర్యంలో దళితుల సంక్షేమ పధకాలను తీసేసిన జగన్ పై వై.సి.పి ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఈముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటూ సభలు నిర్వహిస్తున్నాడనీ సిగ్గులేదా 27 దళితుల పధకాలు ఆపేసినందుకు అని ప్రశ్నించారు. దళితుల జీవితాలలో వెలుగు తెస్తా అని హామీలు, వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి, వారిపైనే ఎస్.సి ఎస్.టి కేసులు పెట్టి హిసిస్తున్నందుకు నిన్ను మళ్ళీ నెగ్గించాలా అని ఎత్తిపొడిచారు. దళితుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా వంచించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. కాకినాడలోను, రాష్ట్రంలోను వై.సి.పిని ఇంటికి పంపేందుకు మేము సిద్ధం అని నినందించారు.
ఈ కార్యక్రమంలో దౌర్ల ప్రవీణ, పోలవరపు రవి, పి.రాజేష్, దుర్గా శివకుమారి, దేవి, సాయి లక్ష్మి, మాధవి, దారపు శిరీష, బట్టు లీల మరియు జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.