కాకినాడ సిటి ఆధ్వర్యంలో యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో సిటీ సహాయ కార్యదర్శి వాడ్రేవు లోవరాజు ఆధ్వర్యంలో డైరీ ఫారం జంక్షన్ ప్రాంతంలో పల్లంరాజు నగర్ రోడ్ నెంబర్ వన్ కరెంటు బిల్లులు పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ కరెంటు చార్జీలను మరింతపెంచి ప్రజలను పట్టిపీడించేందుకు సిద్ధమని, కరెంటు బిల్లులు సాకు చూపెట్టి పధకాలు ఎగేయడానికి సిద్ధమనీ జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా చెపుతున్నాడనీ అలాగే ఎన్నికలంటే యుద్ధమంటున్నాడనీ, ఇలాంటి మనిషిని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు చింతిస్తున్నారనారు. డబ్బు దర్పం ఉంది కనుక ఎక్కడపడితే అక్కడ హోర్డింగులు పెట్టుకున్నారనీ పవన్ కళ్యాణ్ గారి నేత్రుత్వంలో జనసేన పార్టీ కూడా సిద్ధం అంటున్నామనీ కాకినాడలో ద్వారంపూడిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించేదుకు మాకుతోడుగా ప్రజలు కూడా సిద్ధం అంటున్నారనీ ఈప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలుకూడా వీళ్ళని గద్దెదించడానికి మేము సిద్ధం అంటున్నారనీ ప్రజల సమస్యలు తీర్చడానికి జనసేనపార్టీ కూడా సిద్ధం అని నినందించారు. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశంల ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచవని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాసు, సుంకర సురేష్, మండపాక దుర్గాప్రసాద్, పెద్దిరెడ్డి ఉదయభాస్కర్, కంటా రవిశంకర్, ముత్యాల దుర్గాప్రసాద్, షమీరు, దారపు సతీష్, మావులూరు సురేష్, పాలిక శివ, పెద్దిరెడ్డి రాజేష్, బసవడి నాగబాబు, సతీష్ కుమార్, వీర మహిళలు దారపు శిరీష, మిర్యాల హైమావతి, బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి, మూర్త, మాలతి, రత్నం తదితరులు పాల్గొన్నారు.