ప్రతిచేతికీ ఉపాధికోసం యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో పినపోతు సత్తిబాబు & బలసాడి శ్రీనుల ఆధ్వర్యంలో స్థానిక 37 డివిజన్ ప్రగోడా స్కూలు ప్రాంతంలో ప్రతిచేతికీ ఉపాధికోసం యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈ నాలుగు ఏళ్ళలో కాకినాడలో ఉపాధి కల్పించలేకపోయిన ఎం.ఎల్.ఏ & ప్రభుత్వం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని వీరిని నేను ఒకటే అడుగుతున్నాను అదేంటంటే కాకినాడలో యువతకి ఉపాధి కల్పించలేని మీరు దేనికోసం సిద్ధంగా ఉన్నారు వీళ్ళ జీవితాలని చిన్నా భిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారా వీళ్ళకి ఎలాంటి ఉపాధి రాకుండా కకినాడలో ఎలాంటి కర్మాగారం రాకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఏదైనా మాట్లాడితే ఆవేశంగా టాపిక్ డైవర్ట్ చెస్తే ప్రజల అవసరాలు తీరవనీ నిజమైన ప్రజాప్రతినిధిగా మీరు కాకినాడలోని యువతకి ఏంచేసారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కోరారు. తాము ఎప్పటినుండో ఒకటే చెపుతున్నామనీ రాష్ట్రంలో యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయారనీ పవన్ కళ్యాణ్ ఒక్కరే వారికి ఆశాదీపమనీ, ఆయన అందుకుతగ్గట్టుగా మా మేనిఫెస్టోలో ప్రతి చేతికీ పని, ప్రతి చేనుకీ నీరు ఇదే మొదటి అంశంగా మేనిఫెస్టో తయారుచేయబోతున్నామనీ, కాకినాడలో అందరికీ తాము ఈ హామీ ఇస్తున్నామనీ, కావున త్వరలో జరగబోతున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని గిలిపించి అందరూ పనినిపొందే పాలనను పొందేలా ముందుకుసాగుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాదనాల రమేష్, బొద్దు రాజు, మాతా చిన్న, నందా, సహారా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.