చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వాన్ని తరిమి వెయ్యడానికి మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో సాంబమూర్తి నగర్ రామాలయం ప్రాంతంలో 13వ వార్డు అధ్యక్షులు పాలిక శివ ఆధ్వర్యంలో చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వాన్ని తరిమి వెయ్యడానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలతో వాగ్ధానాలు చేసి అధికారం చేపట్టిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలో చేసిన వచ్చాకా వాగ్ధానాలను తుంగలోకి తొక్కి ప్రజా వ్యతిరేక పాలన చేసి ఆఖరికి చెత్తమీద కూడా పన్నులు వేసి ప్రజలను పీడించుకు తిని నిన్న అస్సెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెపుతున్న పధకాలకు ఎక్కడినుండీ డబ్బులు తెస్తారని అడగడం చూస్తుంటే ఈ కాబోయే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మాటల్లోనే తన ఓటమిని ఒప్పేసుకున్నాడని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ముందు తను చేసిన అప్పులకి జమా పద్దులు ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేసారు. ఇచ్చిన పధకాలకు అయ్యే వ్యయం కొండంత ఉంటే తెచ్చిన అప్పు అనకొండాలాగ ఉందనీ మరి అదంతా దేనికి ఖర్చ్చు అయిపోయిందో చెప్పాలిసిన బాధ్యత జగమోహన్ రెడ్డిదే అని నొక్కి వక్కాణించారు. ప్రజలందరూ ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి మేము సిద్ధం అని అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, కరీముల్ల, దవులూరి శ్రీనివాస్, చొల్లంగి శ్రీను, శ్రీహరి, చొల్లంగి మహేష్, అర్జున్, కట్ట సత్యనారాయణ, శంకర్ నదం, కాజా, కుడుపూడి మణికంఠ మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.