రాజారెడ్డిపై వైసిపి గుండాల దాడిని ఖండిస్తున్నాం: కుంటిమద్ది జయరాం రెడ్డి
అనంతపురం: ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డిపై వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వ్యతిరేకిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ భౌతికంగా దాడులు చేస్తే జనసేన నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరిస్తున్నాం.. మేము తిరిగి ప్రతిఘటిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక మారో అర్థం చేసుకోండి? తక్షణమే ధర్మవరం పోలీసు వారు ఈ సంఘటన పైన తగిన విచారణ చేసి దాడికి పాల్పడిన వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ ధర్మవరం ఇంచార్జ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మసూదన్ రెడ్డి గారికి మరియు ధర్మవరం నియోజకవర్గపు జనసేన నాయకులు కార్యకర్తలకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇలాంటి దాడులు మరొకసారి పునరావృత్తం కాకుండా ధర్మవరం పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-2.05.38-PM-1-1024x576.jpeg)