*జనసేన నాయకులు మాదాసు నరసింహ
హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చిట్వేల్ మండలం జనసేన పార్టీ నాయకులు మాదాసు నరసింహ తెలిపారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలని. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. మీడియా అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే వారధి అని మీడియా గొంతు నొక్కడం సమంజసం కాదని ఆయన అన్నారు.
Share this content:
Post Comment