దళితుల భూముల కోసం పోరాటం చేస్తాం: మైలవరం జనసేన

మైలవరం, మూలపాడు గ్రామానికి చెందిన తరతరాలుగా వస్తున్న ఎస్టి, ఎస్సి, బిసి లంక సొసైటీ భూములను కొంతమంది దళారులు మరియు రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తున్నారని గ్రామ ప్రజలు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కడ రామ్మోహన్ దీక్షా శిబిరం వద్దకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా జనసేన పార్టీ లీగల్ సెల్ ద్వారా ఈ విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి బాధిత ఎస్టి, ఎస్సి, బిసి కుటుంబాలకు తమ వంతు బాధ్యతగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, ప్రవీణ్, వెంకట్ స్వామి, కృష్ణ, బాలు పాల్గొన్నారు.