ప్రతి నియోజకవర్గ సెంటర్లో జనసేన జెండా ఎగరేస్తాం: గాదె

మాచర్ల నియోజకవర్గం తాల్లపల్లి గ్రామంలో శనివారం జనసేన పార్టీ జెండా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆవిష్కరించడం జరిగింది. రాయవరం జంక్షన్ నుండి భారీ ర్యాలీగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుతో తల్లపల్లి చేరుకొని జెండా ఆవిష్కరించి నియోజవర్గంలో పార్టీ విజయంపై జనసైనికులకు భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో అధికారం మనదే అని జనసైనికులకు ధైర్యాన్ని నింపటం జరిగింది. జనసైనికులకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఏ సమయంలోనైనా నాకు ఫోన్ చేయండి మీకు అందుబాటులోకి వస్తానని కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. అనంతరం జనసైనికుడైన కొప్పుల రాంప్రసాద్ వివాహంలో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాదు, జిల్లా అధికార ప్రతినిధి భవన్ నారాయణ మరియు కొర్రపాటి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శిలు పులి హరి మరియు అంబటి మల్లి, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు రమేష్, గురజాల మండల అధ్యక్షులు దుర్గారావు, లీగల్ సెల్ రామాంజనేయులు, మరియు మాచర్ల నియజకవర్గ మండల అధ్యక్షులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.