ప్రజా క్షేత్రంలో వైను.. మైను.. సాండ్ అక్రమాలపై ఉద్యమిస్తాం: నాగుర్ వలి

జనసేన పార్టీ నకరికల్లు మండల కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే వైసిపి పార్టీ నేతల్లో భయం మొదలైందన్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యకర్తలే తమ పార్టీ బలమన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బూత్ లెవెల్ నుంచి కేడర్ నిర్మిస్తామని, అధికార వైసిపి ఆగడాలను అడ్డుకుంటామని, ప్రజా క్షేత్రంలో వైను.. మైను.. సాండ్ అక్రమాలపై ఉద్యమిస్తామని నాగుర్ వలి అన్నారు. అధికార వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆ పార్టీ నేతల్లో భయం మొదలైందన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సాధించామని.. అందులో భాగంగా బూత్ లెవెల్ నుంచి క్యాడర్ నిర్మిస్తామన్నారు. స్థానిక సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ దురాహంకార ప్రభుత్వ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరునా సయ్యద్ నాగుర్ వలి కృతజ్ఞతలు తెలియజేసారు.