వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తాం – జనసేన

తిరుపతి, ప్రపంచ 64వ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తెన మధుబాబు ఆధ్వర్యంలో బైరాగి పట్టేడ బాబు జగజ్జివన్ రావు భవనం నందు సుమారు 250 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తిన మధుబాబు, నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని రేపు రాబోయే జనసేన టిడిపి ప్రభుత్వంలో వారి న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొండ రాజమోహన్, హిమవంత్, రాజేష్ ఆచారి, దినేష్ జైన్, హేమంత్, వంశి, సుబ్బు, కృష్ణ, పురుషోత్తం, సాయి, మనోజ్, షరీఫ్, నవీన్, రవికుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.