పిడుగురాళ్లలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తాం: కామిశెట్టి రమేష్

  • పిడుగురాళ్ళ పట్టణంలో జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవమ్

గురజాల: పిడుగురాళ్ళ పట్టణ, మండల స్థాయిలో జనసేన పార్టీని మరింతగా విస్తరిస్తామని.. రానున్న రోజులలో గ్రామస్థాయిలో పార్టీని బలపేతం చేస్తూ.. స్థానిక సమస్యలపై పోరాడతామని మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ అన్నారు. పిడుగురాళ్ళ పట్టణంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి.. పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ..మండల కార్యవర్గ సభ్యులు, నాయకులు, వీరమహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరం జరిగిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ.. నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన పార్టీ నాయకులకు, నియోజకవర్గ ఐటి కోఆర్డనేటర్ మునగ వెంకట్ కు మరియు ఎన్.ఆర్.ఐ టీం కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మండలంలో పార్టీ ని విస్తరించే కార్యక్రమాలు చేస్తామని. ఎక్కడ సమస్య ఉన్నా దానిని పరిస్కరించే విదంగా పోరాటాలు చేస్తామన్నారు. పార్టీ రూపొందించే ప్రతి కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో చేస్తామని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఉద్యమాలు చేస్తామన్నారు. నియోజకవర్గ ఐటీ కోర్దినేటర్ మునగ వెంకట్ మాట్లాడుతూ. నియోజకవర్గ స్థాయిలో పార్టీని మరింత బలంగా తయారు చేయాలని అందుకు మా ఐటీ టీమ్ సపోర్ట్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ప్రధాన కార్యదర్శులు, గుర్రం కోటేశ్వరరావు, చీదెళ్ళ రాము, షేక్ మదీనా, బేతంచర్ల నాగేశ్వరావు, కోసూరి శ్రీకాంత్, వంశీ, అభి, రత్తయ్య, చారి, గుర్రం అశోక్, వీర మహిళలు రమణ, అరుణ, శ్రీలత పాల్గోన్నారు.