సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేలా ప్రయత్నిస్తాం: గాదె

ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు జనరల్ హాస్పిటల్ నందు సత్తెనపల్లి నియోజకవర్గ నగరికళ్లు మండల ఉపాధ్యక్షులు నాగూర్ వలి దంపతులకు శనివారం కుమారుడు జన్మించడం జరిగింది. హాస్పిటల్ నందు వారి దంపతులను కలిసి, వారి బిడ్డకు ఆశీస్సులు అందించి, వారిరువురి దంపతులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అనంతరం గుంటూరు జనరల్ హాస్పిటల్ నందు కొత్త సూపరింటెండెంటును కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం హాస్పటల్ నందు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అందరికీ వైద్య సదుపాయాలు సరిగా అందుతున్నాయా అని అడిగి వివరాలు తెలుసుకున్నారు, ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే జనసేన పార్టీ తరఫున మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని, మీకు అండగా ఉండి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిలా నాయకులు బిట్రగుంట మల్లిక, సిరిగిరి శ్రీనివాస్, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, సాయి తదితరులు పాల్గొన్నారు.