ఉజ్జయిని మహంకాళి బోనాలకు రండి.. కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించిన తలసాని

భాగ్యనగరంలో బోనాల సీజన్ నడుస్తోంది. గత కొన్నివారాలుగా బోనాల పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం తరఫున సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఉన్నారు.