బాసర త్రిబుల్ ఐటీలో ఏం జరుగుతుంది..?: హరీష్ గౌడ్

  • ఎందుకు వరుస మరణాలు సంభవిస్తున్నాయి…?
  • వీటికి కారకులేవరు…?
  • నిన్న దివ్య నేడు లిఖిత

రామగుండం నియోజకవర్గం: బాసరలో విద్యార్థుల వరుస మరణాలకు కారణాలేమిటని జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంఛార్జి మూల హరీష్ గౌడ్ ప్రశ్నించారు. హరీష్ గౌడ్ మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది విద్యార్థులకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన బాసర త్రిబుల్ ఐటీ నేడు ఎందుకు విద్యార్థులను బలితీసుకుంటుంది. బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ ఏం చేస్తున్నట్లు..?, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..?. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాసర త్రిబుల్ ఐటీ పైన సంపూర్ణమైన విచారణ చేపట్టి అసలు కారణాలు, కారకులు ఎవరు అనేది గుర్తించి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు సమాధానం చెప్పి, న్యాయం చేయాల్సిందిగా జనసేన తరఫున హరీష్ గౌడ్ డిమాండ్ చేశారు.