ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన విప్ నాయకర్

నరసాపురం, రంజాన్ సందర్భంగా శుక్రవారం నరసాపురం పట్టణంలో, రాష్ట్ర ప్రభుత్వ విప్, నర్సాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ముస్లిం సోదర, సోదరిమణులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి. హెచ్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, ఆర్డివో దాసిరాజులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, రంజాన్ సందర్బంగా, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విప్ నాయకర్ మాట్లాడుతూ, నర్సాపురం నియోజకవర్గంలో ముస్లింలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. మసీదులు మరియు బరియల్ గ్రౌండ్ లు అభివృద్ధికి తమ వంతు కృషిచేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పధకాలు చేపడుతుందని, తప్పక వాటిని అందరూ వినియోగించు కోవాలని ఈ సందర్బంగా కోరారు. చివరగా ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్. పి శ్రీవేద,తహసీల్దార్ టి.రాజరాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య నర్సాపురం టిడిపి ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, జనసేనపార్టీ, టిడిపి పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, ముస్లిం మత పెద్దలు, కౌన్సిలర్ లు, సర్పంచ్ లు,మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment