జనసేన- తెలుగుదేశం పార్టీల కూటమిని గెలిపించండి – పోలిరెడ్డి

నిడదవోలు నియోజకవర్గం: నిడదవోలు మండలం జీడిగుంట గ్రామంలో ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో ఇంటీంటికి మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిడదవోలు లో జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించాలని కోరారు. సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయినీ కూడా ఈప్రభుత్వం దోచుకుంటోందనీ పేదలని కూడా చూడకుండా ప్రభుత్వం వీళ్ళ మీద అరవై రూపాయల నెలసరి చెత్తపన్ను వేస్తూ వ్యాపారం చేస్తోందనీ, నిత్యావసర సరుకులు ధరలు పెంచేసారని వాటిని వ్యక్తపరచడానికి వైసీపీ వాళ్ళకి భయపడి తీవ్ర భయాందోళన చెందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోలిరెడ్డి వెంకటరత్నం (పీవీఆర్), పెండ్యాల ఎంపీటీసీ ఇంద్ర గౌడ్,మేడా పూర్ణ చంద్రరావు మండలం కమిటీ సభ్యులు కారింకి వరప్రసాద్, అడ్డగర్ల కృష్ణ, భావన సురేష్,యడ్లపల్లి సత్తిబాబు,ముప్పిడి నాగరాజు,ప్రసాద్ గ్రామ జనసేన, తెలుగుదేశం నాయకులు, జనసైనికులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, జనసేన తెలుగుదేశం పార్టీ ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.