బొబ్బిలి అభివృద్ధి కోసం ఎన్.డి.ఏ కూటమిని గెలిపించండి!!

  • సైకిల్ వస్తుంది, సైకో పోతాడు- పవన్ వస్తాడు, పాలన మారుస్తాడు!!

బొబ్బిలి నియోజకవర్గం ఎన్.డి.ఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన మరియు ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు కోసం, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఐ.టి.ఐ కాలనీ సంపత్ వినాయక గుడిలో ఆశీర్వాదం తీసుకొని సైకిల్ గుర్తును ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకోని వెళ్లేలా ఐ.టి.ఐ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలోని అన్ని వీధుల్లో సైకిళ్ళతో పర్యటన చేసారు. మన బొబ్బిలి అభివృద్ధి కోసం, సైకిల్ గుర్తుకు ఓటేయండి అంటూ ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, దిబ్బ కళ్యాణ్, తెలుగుదేశం నాయకులు బొద్దాన అప్పారావు, చంద్రశేఖర్, తెర్లి రామ్మోహన్, మహేష్, కాగాన సునీల్, తదితర జనసేన తెలుగుదేశం బిజేపి పార్టీల నాయకులు, జనసైనికులు మరియు మహిళా నాయకత్వం కూడా పాల్గొనడం జరిగింది.