మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతో అన్నం పౌండేషన్ వారితో పాటు మానవత్వం చాటుకున్న తాళ్లూరి డేవిడ్

మధిర, బోనకల్ మండలం ఏ గోవిందపురం గ్రామంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడటం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారంగా మధిర పోలీసువారికి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీస్ వారు అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావుకి సమాచారం ఇవ్వడం జరిగింది. అన్నం శ్రీనివాసరావు వారి బృందంతో సుమారు రాత్రి 9 గంటల సమయంలో మా సహాయం తీసుకుని పోలీసు వారి సమక్షంలో గుర్తు తెలియని వ్యక్తి బాడీని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరికి తరలించడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్నం పౌండేషన్ వారితో మానవసేవే మాధవసేవ దృక్పథంతో సమాజ సేవ చేయడానికి ముందుకు పోతామని తెలియజేశారు.