మహిళలు ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి: శ్రీమతి పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో మహిళా సాధికారతవారి ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, డిజైన్ పెయింటింగ్ వర్క్ వంటి శిక్షణా తరగతులు 13-07-2022 వ తేది బుధవారం నుంచి ప్రారంభించదలిచాము కావున ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పిలుపునిచ్చారు. శిక్షణ పొందాలనుకునే మహిళలు ఈ క్రింది ఫోన్ నెంబర్ని సంప్రదించి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని తెలిపారు.
ఫోన్:9988639999
శిక్షణా తరగతులు: ఉదయం: 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు.