రెల్లి మహిళా కార్మికులకు సన్మానం మరియు చీరలు పంపిణీ

శ్రీకాళహస్తి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని వారి నివాసం వద్ద శ్రీకాళహస్తి మున్సిపాలిటీ లో పనిచేస్తున్న మహిళా రెళ్ళీ కార్మికులకు సన్మానం చేసి, ప్రతి ఒక్కరికీ చీరలు పంపిణీ చెయ్యడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులు, పార్టీ వీర మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. వారికి అల్పాహారం అందించారు. అనంతరం వినుత కోటా మాట్లాడుతూ ప్రతి రోజూ ప్రజల కోసం పని చేస్తూ, గౌరవం గుర్తింపుకు నోచుకోని మున్సిపాలిటీ రెల్లీ కార్మికులను సన్మానించి గౌరవించడం ఆనందంగా ఉందని తెలిపారు. వారి కోసం స్వయంగా షాపింగ్ చేసి చీరలు కొని ఇవ్వడం సంతోషాన్నిచ్చిందని, జనసేన పార్టీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ప్రాధాన్యత ఇస్తారని, మహిళా రెల్లి కార్మికుల సమస్యలను తప్పక పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారిన తమ కష్టాలు తీరడం లేదని, తమని గుర్తించి, గౌరవించి, సన్మానించి, తమ కోసం ప్రత్యేకంగా చీరలు కొని ఇవ్వడం సంతోషంగా ఉందని వినుతకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు భాగ్య లక్ష్మి, శారద, రాజ్య లక్ష్మి, లక్ష్మి, కవిత, పుష్ప, గాయత్రి, నిర్మల, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment