అయినవిల్లి జనసేన ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

పి.గన్నవరం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో గుర్రాల రాంబాబు అధ్యక్షతన అయినవిల్లి మండలం జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలు సానబోయిన నాగ సీత ప్రత్యూష(ఉష) కొండుకుదురు పోతుకూరు ఎంపీటీసీ సభ్యులు గుర్రాల రమాదేవి, విలస ఎంపీటీసీ సభ్యులు కుప్పాల ఈశ్వర్, పంచాయితీ మెంబర్ కర్రి శైలజ, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి అయినవిల్లి మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.