ఎన్డీఏ కూటమి గెలుపుకు కృషి చేయండి – వంపూరు గంగులయ్య

పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో పాడేరు ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య నియోజకవర్గంలో వివిధ మండల అధ్యక్షులకు, ముఖ్యనాయకులకు సూచనలు చేస్తూ ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి గెలుపు కొరకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, మనమేమి కొత్తగా ప్రభావితం చేయాల్సిన పనిలేదని, కేవలం మనం నిర్మాణం చేసుకున్న ఓటు బ్యాంకు శాతం సద్వినియోగం చేసుకుంటే చాలని, తెదేపా పార్టీ కార్యకర్తలు, నాయకులకు సహజంగా ఉన్న ఓటు శాతంతో సులభంగానే ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారని అందుకుగల పలు కీలకాంశలపై ఎలా వ్యూహాత్మకంగా వెళ్లాలో వివరిస్తూ గ్రామస్థాయిలో జనసైనికులకు వారి కుటుంబ సభ్యులకు ఏ విదంగా భాగస్వామ్యం చెయ్యాలో వివరించారు. మరియు తదితర ముఖ్య మైన అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, సీసాలి భూపాల్, జి.మాడుగుల నాయకులు మసాడి సింహాచలం, తాంగుల రమేష్, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, గూడెం మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, అనిల్ కుమార్, చిన్ని రాజుబాబు, సుబ్బారావు, రవికుమార్, శ్రీను, పాంగి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.