జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయండి: మహంతి ధనంజయ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మహంతి ధనంజయ ఆధ్వర్యంలో రామభద్రపురం మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మహంతి ధనంజయ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో జనసైనికులు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిదంగా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముల్లు కిషోర్, యాళ్ల మణి మార్, కొట్నానబుచ్చినాయుడు, బండారు శ్రీనివాసరావు, మూడడ్ల బాలాజీ, కోట్యాడ సాయి మరియు ఆ గ్రామ క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-03-at-9.32.09-PM.jpeg)