జనసేన బలోపేతానికి కృషి చేయండి

  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం సిద్ధవటం మండల పరిధిలోని ముమ్మడి గుంటపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ముందుగా ముమ్మడగుంటపల్లె జనసేన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పలు సమస్యలపై ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, మన్నూరు గోపి, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.