జనసేన పార్టీకీ కార్యకర్తలే బలం: శివాజి మిరియాల
- ప్రతి ఒక్కరూ క్రీయాశీలక సభ్యత్వం తప్పనిసరిగా తీసుకోవాలి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ నాయకులు శివాజి మిరియాల
సత్తుపల్లి: జనసేన పార్టీ చేపట్టబోయే మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులందరూ విజయవంతం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు మిరియాల శివాజి కోరారు.. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్నవారు మరలా రెన్యువల్ చేయించుకోవాలి అని, కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునేవారికి ఇదోక మంచి అవకాశం అని అన్నారు. జనసేన పార్టీ ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన 96 మంది కార్యకర్తలకు ప్రమాద భీమా కింద 4 కోట్ల 80 లక్షల రూపాయలు అందించారు. ప్రమాదవశాత్తు గాయపడిన 169 మందికి జనసైనికులకు 60 లక్షల 90 వేల 781 రూపాయలు అందించారు. మొత్తం 5కోట్ల 40లక్షల 90వేల 781 రూపాయలు అందజేసిన విషయం గుర్తుచేశారు. కేవలం 500 రూపాయల సభ్యత్వ రుసుముతో ప్రమాదంలో మరణిస్తే 5లక్షల రూపాయల ప్రమాద భీమా, మరియు గాయపడితే 50 వేల రూపాయలు అందించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్నారు. జనసేన కార్యకర్తలకు ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఎంతో ఖర్చుచేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/shivaaji-1024x576.jpg)