కాకినాడ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం
తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కాకినాడ చల్లా ఫంక్షన్ హాల్ లో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా కోనసీమ జిల్లాను కోనసీమ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని జిల్లా జనసేన పార్టీ పిఏసి సభ్యులు, జనసేన పార్టీ ఇంచార్జ్ లు కార్యవర్గ సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ లు, కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-8.12.08-PM-1024x472.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-8.20.54-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-8.12.07-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-8.12.08-PM-1-1024x767.jpeg)