అధ్వానంగా దేవరాపిల్లి రోడ్డు
- తక్షణమే సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేసిన జనసేన నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు
ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, దేవరాపిల్లి గ్రామం నుండి కుమ్మసిగడాం గ్రామం వరకు రోడ్డు గుంతలమయం. హిన్నపాటి వర్షానికే రోడ్డు అంతా అధ్వనంగా తయారు అవుతుంది. క్రిందట సంవత్సరం జనసేన పార్టీ నాయకులు ఆరోడ్డు అధ్వాన స్థితిపై క్యాంపెయిన్ చేసాము. అయినా గానీ వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆరోడ్డు మార్గంలో చుట్టుపక్కల దాదాపు 10 గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారు కావున ప్రభత్వం వెంటనే స్పందించి సరైన రోడ్డు మార్గం నిర్మించాలని జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-20-at-8.36.59-PM-458x1024.jpeg)