అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన: గూడూరు మండలం, గూడూరు గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వద్ద, గణపతి నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్తీకమాస అన్నసమారాధన కార్యక్రమంలో ఆదివారం గ్రామస్థుల ఆహ్వానం మేరకు పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని, శ్రీ సాయి నాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం గ్రామపెద్దలు మరియు కమిటీ సభ్యులు రామ్ సుధీర్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు జనసేన నాయకులు దివి శ్రీనివాస్, బాదం వినోద్, గుడిసేవ సాయి ప్రసాద్, కొఠారి మల్లిబాబు, బాకీ నాని, సింగంశెట్టి అనీల్, నందం శివ స్వామి, వన్నెంరెడ్డి సాయి కిరణ్, అంజిబాబు, అఖిల్, మహేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.