మంత్రి జోగి రమేష్ పాలనా ఘనతపై యడ్లపల్లి రామ్ సుధీర్ పోస్టర్ ఆవిష్కరణ

పెడన నియోజకవర్గంలో శుక్రవారం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో చేసే అవినీతి అక్రమాలను మరియు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పోస్టర్ రూపంలో ఆవిష్కరించారు. పెడనలో మీడియా ముఖంగా ఈ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ మంత్రి జోగి రమేష్ వీటికి సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ చేపట్టే
“రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జగనన్న కాలనీలు” కార్యక్రమాన్ని ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలనను జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని #ఝగనన్నంఒసం హ్యాష్ ట్యాగ్ తో పెడన నియోజకవర్గంలోని పెడన టౌన్, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ఉన్న జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్న ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయండి అంటూ శుక్రవారం పెడనలో మీడియా ముఖంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి వరుదు రమాదేవి, మత్యకార వికాస విభాగం ఛైర్మెన్ ఒడుగు ప్రభాస్ రాజు, పెడన మండలం అధ్యక్షులు ఊసా వెంకయ్య, కృత్తివెన్ను మండలం ఉపాధ్యక్షులు పాసం నగమల్లేశ్వరరావు, పోలగాని లక్ష్మీ నారాయణ, పూల్లేటి దుర్గారావు, దివి శ్రీనివాస్, సయ్యిద్ షఫీ, బొడ్డు వర్ధన్ రావు, బొడ్డు సుబ్బారావు, దోమతోటి కృష్ణంరాజు, బొడ్డు ఏసుదాసు, కొప్పినీటి శివమణి, కొఠారి మల్లి బాబు, నందం శివ స్వామి, సింగంసెట్టి అశోక్ కుమార్, బాకీ నాని, గడ్డిగోపుల నాగ, పవన్, వినోద్, అంజి, ప్రసాద్, మున్న మరియు జనసైనికులు పాల్గొన్నారు.