అక్రమంగా బనాయించిన కేసులో కోర్టుకు హాజరైన యడ్లపల్లి
పెడన నియోజకవర్గం: మంత్రి జోగి రమేష్ పెడనలో చేస్తున్న అవినీతి అక్రమాలను, నియోజకవర్గంలో ప్రజాసమస్యలను పోస్టర్లు (గోడపత్రికల) రూపంలో ప్రశ్నించి వాటిని అంటించినందుకు మంత్రి చేసిన అక్రమాలు ఎక్కడ బయట పడతాయో అనే భయంతో జనసైనికుల మీద పోలీస్ స్టేషన్లో దాడి చేయడమే కాకుండా, మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మరియు ముగ్గురు జనసైనికులపై అక్రమ కేసులు బనాయించారు. ఈ అక్రమ కేసులు నేపథ్యంలో జనసేన లీగల్ సెల్ నాయకులు బాసు నాంచారయ్య నాయుడుతో కలిసి యడ్లపల్లి రామ్ సుధీర్ సోమవారం మచిలీపట్నం కోర్టుకు హాజరయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-6.54.06-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-6.54.06-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-6.54.05-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-03-at-6.54.07-PM-786x1024.jpeg)