పలువురు ముఖ్య నేతలను కలిసిన యల్లటూరు

  • మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబుని మర్యాద పూర్వకంగా కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబుని శుక్రవారం రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి బొకే అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి, జనసేన పార్టీ రాజకీయ స్థితిగతులపై వారిరువురూ చర్చించుకోవడం జరిగినది.

  • యెద్దల సుబ్బరాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట రాజంపేట నియోకజవర్గ సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఆర్.టి.సి. రీజనల్ చైర్మెన్ యెద్దల సుబ్బరాయుడుని మరియు వారి కుమారుడు మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ చైర్మెన్ యెద్దల విజయ సాగర్ ని వారి నివాసంలో శుక్రవారం రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆశీస్సులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి శివరామరాజు, మాజీ జడ్పిటిసి షబ్బీర్ అహ్మద్, కాపు సేన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల చలపతి తదితరులు పాల్గొన్నారు.

  • మాజీ ఎంపీ పాలకొండ్రాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాయచోటిలో పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు సుగవాసి పాలకొండ్రాయడుని ఆయన నివాసంలో కలిసి ఆయనకు శాలువాతో అభినందించి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయన శ్రీనివాసరాజుకి పలు రాజకీయ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి రాజంపేట ఎంపీ మరియు ఎమ్మెల్యే స్థానాలు పూర్తిగా కైవసం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

  • మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం మర్యాద పూర్వకంగా కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాయచోటిలో సుగువాసి బాలసుబ్రహ్మణ్యంని ఆయన నివాసంలో రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన మద్దతును ఆశీస్సులను కోరడం జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది. ఈ భేటీలో మాజీ నందలూరు జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు మరియు సుండుపల్లె మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.