అంగన్వాడీల సమ్మెకు యల్లటూరు శ్రీనివాస రాజు సంఘీభావం

రాజంపేట: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత మూడు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు చేస్తున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు మాజీ డిఆర్డిఏ అధికారి, రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరసనలో గురువారం శ్రీనివాసరాజు పాల్గొని తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ 26 వేలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ 5 లక్షలకు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని, సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, సర్వీసులో ఉండి మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని.. తదితర డిమాండ్లపై అంగన్వాడీలు చేస్తున్న సమ్మె న్యాయపరమైనదని అన్నారు. న్యాయపరమైన అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు అంగన్వాడీలకు జనసేన అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో.. రాజంపేట జనసేన నాయకులు ఆకుల చలపతి, నాసర్ ఖాన్, పివిఆర్ కుమార్, చౌడయ్య, అభి గారి గోపాల్, కాపు సంక్షేమ సేన అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ బాబు, మరియు జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ కుప్పాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.