క్రిస్మస్ వేడుకలలో యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పట్టణంలో సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా భవాని నగర్ లో ఉన్న నిజస్వరూప చర్చి నందు జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు రాజంపేట నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ విశ్వ ప్రసాద్ శ్రీనివాసరాజుని ఆశీర్వదించి తర్వాత క్రిస్మస్ క్యాలెండర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, నాసర్ ఖాన్, ఆకుల చలపతి, మౌలా, పత్తి నారాయణ, చిట్టే భాస్కర్, కట్టారు బాబు, గౌనిపురం రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *