మున్సిపాలిటీ ఉద్యోగుల సమ్మెకు యల్లటూరు శ్రీనివాసరాజు మద్దతు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణంలో రాజంపేట మున్సిపాలిటీ ఉద్యోగుల మరియు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 26 నుండి మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు వారి శిబిరానికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రారంభించాలని సత్వరమే ఈ ప్రభుత్వం వారి సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేల్ రవికుమార్, కార్మిక సంఘ నాయకులు సిహెచ్. ఓబులేసు, కే. ప్రసాద్ నాగరాజు, యం. కోదండం, క్రిష్ణయ్య, పి.వి.రమణ, కె.నరసింహులు, కార్తిక్, మరియు డి.లక్ష్మీ దేవి, రాములమ్మ, అక్కమ్మ, పీరమ్మ, పెంచలమ్మ, రాజేశ్వరి, దనమ్మ, నాగమ్మ, జయమ్మ, రాజంపేట జనసేన నాయకులు మాజీ జెట్పీటీసి యల్లటూరు శివరామరాజు, కోలాటం హరి కృష్ణ, చలపతి, మురళి, మల్లికార్జున, నారదాసు రామచంద్ర, మౌల, పత్తి నారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు.