కాపు సంక్షేమ సేన సమావేశంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణంలో ఉన్న యల్లటూరు భవన్ యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం కాపు సంక్షేమ సేన అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుడ్డా శరత్ ఆధ్వర్యంలో రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గ నేత యల్లటూరు శ్రీనివాసరాజు ముఖ్యఅతిథిగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శరత్ మాట్లాడుతూ అధ్యక్షులు హరిరామ జోగయ్య గారి ఆదేశాలతో ఉమ్మడి కడప జిల్లా కో ఆర్డినేటర్ యర్రంశెట్టి మస్తాన్ రాయల్ మరియు అన్నమయ్య జిల్లా రెడ్డి రాణి సూచనల మేరకు రాజంపేట నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆకుల చలపతి గారిని నియమిస్తున్నానని తెలిపి కాపులంతా ఐక్యమత్యంగా వుండి అందరం కలిసి రాజ్యాధికారం కోసం కృషిచేయాలని కోరారు. అదే విదంగా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ రాజంపేట కాపు సంక్షేమ సేన నాయకులు కార్యకర్తలు రాజంపేట జనసేన పార్టీ కి అండగా నిలబడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మనమందరం అన్ని కులాల వారిని గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారిని సి.యం చేసేందుకు కృషి చేయాలని సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన రాజంపేట ప్రధాన కార్యదర్శి కరణం శ్రీధర్, భీమినేని రమేష్, పివిఆర్ కుమార్, రామా శ్రీనివాసులు, చిట్టే భాస్కర్, సెట్టం రవి, అనుమలకొండ మనోహర్, కొండేటి మురళి, ఆకుల మారయ్య, అనూష పెంచలయ్య, నారప్ప శెట్టి వేణుగోపాల్, భువనగిరి పల్లి శంకరయ్య, ప్రసాద్, దుష్యంత్, గణేష్, శీను, సుధీర్, చల్లా మధు, కత్తి సుబ్బరాయుడు, అబ్బి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.