జగన్ రెడ్డిపై ధ్వజమెత్తిన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయము (యల్లటూరు భవన్) నందు జనసేనపార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్టు మాట్లాడిన జగన్ రెడ్డికి మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు విమర్శించారు. జనసేన పార్టీ పోటీచేసిన ప్రతిచోట గెలిపించి వంద శాతం స్ట్రైక్ రేట్ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ ని చూసి భయపడుతున్నారని అర్థమవుతుంది అని యల్లటూరు శ్రీనివాస రాజు అన్నారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దోచుకున్న డబ్బుతో అహంకారం గర్వం ఇంకా తగ్గలేదు. ఎన్నికలలో ప్రచారం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు నిన్ను అధఃపాతాలానికి తొక్కకపోతే నాపేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి నేడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నువ్వు చర్లపల్లి జైలుకి ఎక్కువ తీహార్ జైలుకి తక్కువ అది తెలుసుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారని యల్లటూరు శ్రీనివాస రాజు హెచ్చరించారు.

Share this content:

Post Comment