ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణంలో బలిజపల్లెలో ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలందరూ జరుపుకునే శ్రీశ్రీశ్రీ గంగమ్మ జాతర భక్తి శ్రద్ధలతో అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ జాతర సందర్భంగా కార్యనిర్వాహకుల ఆహ్వానం మేరకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు యల్లటూరు శ్రీనివాస రాజుకి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి పూలమాల వేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు. రాజంపేట పార్లమెంటు, నియోజకవర్గప్రజలకు అమ్మవారి ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించిన యల్లటూరు శ్రీనివాస రాజు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment