తాళ్లపాకలో ప్రచారంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా,  రాజంపేట నియోజకవర్గం తాళ్లపాకలో జనసేన, బిజెపి, టిడిపి కూటమి బలపరిచిన రాజంపేట పార్లమెంటు మరియు అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరియు సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇప్పుడు ఉన్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాలని యల్లటూరు శ్రీనివాస రాజు పిలుపునిచ్చారు. ఇంటింటికి కరపత్రాలను పంచిన నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో జనసేన రాజంపేట పట్టణ నాయకులు శింగంశెట్టి నరేంద్ర, ఉప సర్పంచ్ బాలరాజు సుమన్, కొండూరు విశ్వనాధ రాజు, పివిఆర్ కుమార్, ఆకుల చలపతి, సుబ్బరాజు, యల్లమ రాజు, వెంకటేశ్వర రాజు, బాల సాయి, పూల మురళి, జవ్వాజి నరేష్ మరియు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.