బోయనపల్లెలో పర్యటించిన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం బోయినపల్లె గ్రామ ప్రజలు, యువత మరియు బిజెపి రాష్ట్ర నాయకులు పునగాని పాపయ్య ఆహ్వానం మేరకు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు బోయనపల్లె గ్రామంలో పర్యటించి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని స్ధాపించినప్పుడే రాజంపేట అభివృద్ధి బాటలో సాగుతుందని తెలిపి అందరి ఆశీర్వాదాలు కోరారు. యల్లటూరు శ్రీనివాస రాజుని పాపయ్య, గ్రామ ప్రజలు మరియు చేనేత కార్మికులు సాదరంగా స్వాగతించి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకున్న యల్లటూరు శ్రీనివాస రాజు. ఈ కార్యక్రమంలో హస్తి సుబ్బరాజు, పి.వెంకట రామరాజు, పి.పవన్ యాదవ్, యస్.వెంకటేష్, యమ్.వెంకటసుబ్బయ్య, జి.గంగ రాజు, బి.పురుషోత్తం, సుబ్బరామరాజు, సోమల సాయికుమార్, ఆవుల శివాజి, సి.సాయి మరియు రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్, రాజేష్ వర్మ, అబ్బిగారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.