ముమ్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యశస్వి

తెలంగాణ, కూకట్పల్లి: కూకట్‌పల్లి బిజెపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ను ఆదివారం యశస్వి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ప్రచార కార్యక్రమాల నిర్వహణ తెలుసుకుంటూ “కే పి హెచ్ బి కమ్యూనిటీ హాల్ లో జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు. సభా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను వివరించడం జరిగింది. కూకట్‌పల్లి యావత్ ప్రజానీకానికి, ముఖ్యంగా ఇక్కడ స్థిరపడ్డ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి మన బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు.