Rajamahendravaram: మైనారిటీలను మోసం చేసిన వైసిపి: జనసేన పార్టీ మైనారిటీ నాయకులు షేక్ బాషా

రాష్ట్ర ఎన్నికల సమయంలో వైసీపీ అనేక హమీలు గుప్పించి ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం చాలా దురదృష్టకరమని ముస్లింలను మోసం చేసిందని జనసేనపార్టీ మైనారిటీ నాయకులు షేక్ బాషా ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. ఎలక్షన్ సమయంలో దుల్హాన్ పధకం క్రింద లక్ష రూపాయలు ఇస్తామని మరియు ఇస్లాం బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని ఋణాలు ఇస్తామని హామి ఇచ్చారు. మైనారిటీ కార్పొరేషన్, నూర్బాషా కార్పొరేషన్ ద్వారా రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఒక్క ఋణం కూడా ఇవ్వకపోగా ముస్లింల ఆస్తుల కబ్జాకు గురికావడం చాలా దురదృష్టకరమని… ఇప్పటికైన ముస్లిం సోదరులు గమనించి 2024 లో వైసీపీకి సరైన బుద్ధి చెప్పాలని ముస్లింల జీవన విధానంపై పూర్తి అవగహన ఉన్న పవన్ కళ్యాణ్ గారి న్యాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది.