మంచి చేశామంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచేశారు: నార్పల జనసేన నాయకులు

శింగనమల, కూటమి ప్రభుత్వముతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని నార్పల మండలం జనసేన నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారి శ్రావణి ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగింది. ప్రచారంలో నార్పల జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రస్తుతం నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి వచ్చిందన్నారు వచ్చే మా ఉమ్మడి ప్రభుత్వంలో గ్లోబల్ కంపెనీల ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా తెలుగుదేశం జనసేన అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారన్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించి నిరుద్యోగం తగ్గించే చర్యలు చేపడతామన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కి మోసం చేసిన వైసిపి పార్టీని నామరూపాలు లేకుండా చేసేలా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రరాష్ట్రాన్ని గంజాయికి నిలయంగా మార్చారన్నారు ఎక్కడ గంజాయి పట్టుబడిన ఆంధ్ర ప్రదేశ్ వైపు దారులన్నీ చూపిస్తున్నాయన్నారు రాష్ట్రా సహజ వనరులన్నీ నాశనం చేస్తూ మంచి చేస్తున్నామంటూ రాష్ట్రాన్ని ముంచేశారని ఎద్దేవా చేశారు. మన సింగనమల మన బండారు శ్రావణి నినాదంతో ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు 25 కేజీల బియ్యం కోసం కాకుండా 25 సంవత్సరాల మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈసారి కూటమి అభ్యర్థి బండారు శ్రావణి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని గూగూడు గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నార్పల మండలం జనసేన పార్టీ కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, సీనియర్ నాయకులు తుపాకుల భాస్కర్ పొన్న తోట రామయ్య నరసింహ వినోద్ నారాయణస్వామి కుళ్లాయప్ప వినోదం లోకేష్ శ్రీధర్ బాబు సాకే రాజు యశ్వంత్ పవన్ ప్రకాష్ మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.