వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్దిని గాలికి వదిలేసింది

  • శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల: పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల మండలంలోని గరికిపేట గ్రామంలో శ్రీమతి లోకం మాధవి గారు గడపగడపకి పర్యటించారు, గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ దుష్ట పాలన ని ప్రాలద్రోలి ప్రజా పాలనకు నాంది పలకాలని కోరారు. ఎన్నికల ముందు వచ్చి చేయలేని వాగ్దానాలు ఇచ్చినందువలనే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటునబడిందని ప్రజలకి తెలియజేశారు. ఆయా గ్రామాలలో డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులకు ఉన్నారు మరియు రోడ్లు, కాలువలు, వీధి దీపాలు సరిగా లేవని, పథకాలు అమలు తీరులో అధికార వైసిపి ప్రభుత్వం పక్షపాతి తీరు వ్యవహరిస్తుందని ప్రజలు వాపోయారు వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత అధికార వైసిపి ప్రభుత్వానికి పొరపాటున కూడా ఓటు వేయమని ప్రజలు వాపోయారు. శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగా పనితీరు అసలేమీ బాగాలేదని అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరటం లేదు మరియు వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు రావటం లేదు. మెరుగైన పరిపాలన సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యమని ప్రతి ఒక్క కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నిష్పక్షపాతంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు.