ఎన్నికలకు ముందే వైసీపీ ఖాళీ
- ముమ్మిడివరంలో టీడీపీ లోకి భారీగా చేరికలు
- కండువా వేసి, ఆహ్వానించిన అమలాపురం పార్లమెంటు ఇన్చార్జ్ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు
ముమ్మిడివరం: సార్వత్రిక ఎన్నికలకు ముందే ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ ఖాతా ఖాళీ అవుతోందని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు ఇన్చార్జ్ హరీష్ బాలయోగి అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన పట్టణంలోని తాడి నర్సింహారావు నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కుటుంబాలు మూకుమ్మడిగా టీడీపీలో చేరాయి. వారందరికీ కండువాలు వేసిన హరీష్ బాలయోగి.. సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనకు చేరికలే నిదర్శనమని తెలిపారు. టీడీపీలో చేరిన వారంతా సీనియర్ నాయకుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై గడగడపకు వెళ్లి, ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.