ప్రజలను బోల్తా కొట్టించటం వైసీపీ కే సాటి: అరకు జనసేన

అరకు, ప్రజలను బోల్తా కొట్టించడంలో వారికి వారే సాటి అని, ప్రజలను బోల్తా కొట్టించడంలో వైసీపీ ప్రభుత్వం ఆరితేరిందని అరకు నియోజకవర్గ జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను మోసం చేయడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పుడు విద్యావంతులు మేధావులైన ప్రభుత్వ ఉద్యోగులను కూడా బోల్తా కొట్టించాలని చూస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామారావు, సురేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు.