దళితులకు జనసేన అండగా ఉంటుంది: ఎస్.వి.బాబు

  • దళిత కుటుంబాన్ని వేధిస్తున్న వైసిపి నాయకులు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితుల ఆత్మగౌరవం మంట కలిసింది, వైసిపికి ఓటేసి గెలిపించిన పాపానికి వైసీపీ నాయకులు దళితులను అనేక రకాలుగా అవమానాలు గురి చేస్తున్నారని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా పెడన మండలం ఉరిమి గ్రామ వాసి దళిత సామాజిక వర్గానికి చెందిన చిన్నం ఉదయభాస్కర్ వికలాంగుడు. అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఉదయ భాస్కర్ జనసేన పార్టీ అభిమాని కావడం చేత అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఉదయ భాస్కర్ భార్య అయిన చిన్నం రాజామణి గతంలో ఆశా వర్కర్ గా పనిచేశారు, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు తెలియజేశారని కారణంతో స్థానిక వైసీపీ నాయకులు ఆమె ఉద్యోగాన్ని తీయించేసారు. చిన్నం రాజామణి పై అధికారులకు తన ఉద్యోగం విషయంలో విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేదు. మంత్రి జోగు రమేష్ అండతో వైసిపి నాయకులు ప్రతి గ్రామంలో ఇలాగే తమకు మద్దతు తెలపలేదని, లేదా తాము చెప్పిన మాట వినటం లేదని దురుద్దేశంతో దళితులపై కక్షపూరితంగా వ్యవహరించటం దుర్మార్గం. ఇది తెలిసి కూడా సమర్థిస్తున్న మంత్రి జోగి రమేష్ దళిత ద్రోహి. ఉదయ భాస్కర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఉరిమి వైసిపి నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నా మీ పద్ధతి మార్చుకోండి. మనం జీవిస్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో, మీరు అనుసరిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంలో కాదు. చిన్న ఉదయ భాస్కర్ కుటుంబానికి జనసేన పార్టీ అండదండగా ఉంటుంది. ఈ విషయంగా ఉదయ భాస్కర్ తో ఫోన్లో మాట్లాడటం జరిగింది. చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం చాలా ఆందోళనలో ఉన్నది. ఈ విషయంపై మంత్రి జోగు రమేష్ నోరు ఇవ్వాలి. తమ అనుచరులను కట్టడి చేసుకోవాలి. లేని పక్షాన దళితులకు అండగా ఉంటూ జనసేన పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అని ఎస్.వి.బాబు హెచ్చరించారు.