రాష్ట్రాన్ని కామాంధ్రప్రదేశ్ గా మార్చిన వైసీపీ నేతలు: ఆళ్ళ హరి

  • పోర్న్ స్టార్ లుగా మారుతున్న వైసీపీ నేతలు
  • రాష్ట్ర రాజకీయాల్లో హుందాతనం లేకుండా చేశారు
  • మాటల దగ్గర మొదలుపెట్టి వీడియోల వరకు వెళ్లిన వైసీపీ నేతల వికృత చేష్టలు
  • మహిళలంటే వైసీపీ నేతలకు ఆటబొమ్మల్లా కనపడుతున్నారు
  • ఇలాంటివాళ్ళకా మనం ఓటు వేసింది అంటూ సిగ్గుపడుతున్న ప్రజలు
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచక , అసాంఘిక కార్యకలాపాలకు అంతే లేకుండా పోతుందని , సాక్ష్యాత్తు మంత్రులు , పార్లమెంట్ సభ్యులే తమ వికృత చేష్టలతో రాష్ట్రాన్ని కామాంధ్రప్రదేశ్ గా మార్చారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్హించిన ఎంపీ గోరంట్ల మాధవ్ జుగుప్సాకరమైన వీడియోపై ఆయన స్పందించారు. వైసీపీ పాలనలో మహిళలకు తగిన గౌరవం లేదని వారిని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో హుందాతనం లేకుండా పోయిందని , రాజకీయాలను ఈ స్థాయిలో దిగజార్చటం రాష్ట్ర భవిష్యత్ కు మంచిది కాదన్నారు. ఒక మంత్రి అరగంట అంటూ మరో మంత్రి గంట అంటూ మాట్లాడిన మాటలు మాత్రమే ఇప్పటివరకు విన్నామని ఇప్పుడు ఒక నీలి వీడియోలో సాక్ష్యాత్తు పార్లమెంట్ సభ్యుడే పోర్న్ స్టార్ అవతారం ఎత్తటం నీచమన్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అర్ధం కావటం లేదన్నారు . గతంలో ఒక ప్రజాప్రతినిధి మీద ఆరోపణ వచ్చినా , అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకునేవారని ,వైసీపీలో మాత్రం అలాంటి వారికి ప్రమోషన్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత రాష్ట్రాన్ని అప్పులకుంపట్లోకి నెట్టి సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతుంటే, ఆయన సహచరులు తమ హోదాని , గురుతర బాధ్యతని మరచి బట్టలిప్పి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు, వైసీపీ నేతలు ఇలా తయ్యారవ్వటానికి ముఖ్యమంత్రి కూడా ఒక కారణమని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేవి ఎక్కడా జరగకపోవడంతో మంత్రులు, శాసనసభ్యులకు చేయటానికి పని ఏమిలేక ఇలాంటి నీచమైన పనులకు దిగుతున్నారన్నారు. ఇలాంటి వారినా మేము దేవాలయ్యాల్లాంటి పార్లమెంటుకి, అసెంబ్లీకి పంపించింది అని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బాధ్యతతో హుందాతనంతో మెలగాలని లేనిపక్షంలో ప్రజలు రోడ్ల మీద కూడా తిరగకుండా వైసీపీ నేతలపై తిరగబడతారని ఆళ్ళ హరి హెచ్చరించారు.