రాష్ట్రంలో వైసీపీ ఖాళీ: బొలిశెట్టి

  • కూటమిలోకి వలసలు వెల్లువ

తాడేపల్లిగూడెం: రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో వైసిపి మొత్తం ఖాళీ అవుతుందని కూటమిలోకి వైసీపీ నాయకుల చేరిక వెల్లువ ఎత్తిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెటపాడు మండలం మేనవల్లూరులో జయహో బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టించి ఆ వర్గాలను చిన్నచూపు చూసిన జగన్ ఇప్పుడు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్న కార్పొరేషన్లన్నింటికీ నిధులు వెచ్చింది వారికి ఆర్థిక పరిపుష్టి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేజర్ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.